News October 1, 2024
800 మందితో భారీ బందోబస్తు: కర్నూలు ఎస్పీ

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో నేడు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బిందు మాధవ్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. DSPలు-5, CIలు-38, SIలు-40, ASI, HCలు-160, PCలు-213, హోంగార్డులు-106 మందితో పాటుగా 3 ఏఆర్, 5 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించినట్లు ఈమేరకు ఎస్పీ వెల్లడించారు.
Similar News
News November 22, 2025
కలెక్టర్ సిరి హెచ్చరిక

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఏ.సిరి నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులు అందితే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.
News November 22, 2025
కె.నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ వార్షిక తనిఖీ

కె.నాగలాపురం పోలీసు స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.
News November 22, 2025
కె.నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ వార్షిక తనిఖీ

కె.నాగలాపురం పోలీసు స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.


