News January 29, 2025

స్వతంత్ర భారత్: తొలి కుంభమేళాలో 800 మంది మృతి

image

ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో 20 మంది చనిపోవడం విషాదం నింపింది. అయితే దేశంలోని కుంభమేళాల్లో తొక్కిసలాట జరగడం ఇదేమీ తొలిసారి కాదు. స్వతంత్ర భారత్‌లో 1954లో నిర్వహించిన తొలి మేళాలో తొక్కిసలాట జరిగి 800 మంది మరణించారు. 1986లో హరిద్వార్‌లో 200 మంది, 2003లో నాసిక్‌లో 39 మంది, 2013లో అలహాబాద్‌లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News

News January 22, 2026

విశాఖలో టీ20.. రేపట్నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు

image

AP: విశాఖలో జనవరి 28న భారత్-న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను రేపట్నుంచి ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. సా.5 గంటల నుంచి ‘డిస్ట్రిక్ట్’ యాప్‌లో టికెట్స్ అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. 5 టీ20ల సిరీస్‌లో నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించి 1-0తో లీడ్‌లోకి వెళ్లింది.

News January 22, 2026

మాపై అధిక పన్నులు వేయండి.. బిలియనీర్ల లేఖ

image

తమపై అధిక పన్నులు వేయాలంటూ 24 దేశాలకు చెందిన కుబేరులు దావోస్‌లో రిలీజ్ చేసిన లేఖ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ‘టైమ్ టు విన్.. వియ్ మస్ట్ విన్ బ్యాక్ అవర్ ఫ్యూచర్. లీడర్స్ ఎట్ దావోస్ టాక్స్ ది సూపర్ రిచ్’ అనే హెడ్డింగ్‌తో లేఖ రాశారు. దీనిపై 400 మంది సూపర్ రిచ్ పీపుల్ సంతకాలు చేశారు. పేదలు, అత్యంత సంపన్నుల మధ్య నానాటికీ పెరిగిపోతున్న దూరాన్ని తగ్గించడానికి తమలాంటి వారిపై అధిక పన్నులు వేయాలని కోరారు.

News January 22, 2026

బెండ, టమాటా, వంగ పంటల్లో తెగుళ్ల నివారణ

image

ఈ సీజన్‌లో కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్‌ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.