News January 29, 2025
స్వతంత్ర భారత్: తొలి కుంభమేళాలో 800 మంది మృతి

ప్రయోగ్రాజ్ మహా కుంభమేళాలో అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో 20 మంది చనిపోవడం విషాదం నింపింది. అయితే దేశంలోని కుంభమేళాల్లో తొక్కిసలాట జరగడం ఇదేమీ తొలిసారి కాదు. స్వతంత్ర భారత్లో 1954లో నిర్వహించిన తొలి మేళాలో తొక్కిసలాట జరిగి 800 మంది మరణించారు. 1986లో హరిద్వార్లో 200 మంది, 2003లో నాసిక్లో 39 మంది, 2013లో అలహాబాద్లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.
Similar News
News October 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 49 సమాధానాలు

1. శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన భక్తుడు ‘కంచర్ల గోపన్న’.
2. భూలోకానికి పైన ఉండే మొదటి లోకం ‘భువర్లోకం’.
3. రామసేతు నిర్మాణంలో ప్రధాన ఇంజినీర్లు ‘నల-నీల’ అనే ఇద్దరు వానరులు.
4. యుద్ధాన్ని చూస్తూ దాన్ని ధృతరాష్ట్రునికి వివరించింది ‘సంజయుడు’.
5. శివుడు తన జటాజూటంలో బంధించిన నది ‘గంగ’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 28, 2025
గోళ్లు అందంగా ఉండాలంటే ఇలా చేయండి

చేతులు అందంగా ఉండటంలో గోళ్లు ప్రముఖపాత్ర పోషిస్తాయి. వీటిని సంరక్షించుకోవడానికి మీ కోసం కొన్ని చిట్కాలు. రెగ్యులర్గా గోళ్లను కట్ చేసుకోవాలి. గోళ్లు ఎక్కువగా నీటిలో నానకుండా పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మీ నెయిల్స్, క్యూటికల్స్ను మాయిశ్చరైజ్ చెయ్యాలి. నెయిల్ పెయింట్ ఎక్కువ కాలం ఉంచకుండా చూసుకోవాలి. ఫంక్షన్ల వంటివి పూర్తయిన తర్వాత.. పాలిష్ రిమూవ్ చేసుకోవడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
News October 28, 2025
NOV 1 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్

ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న పొల్యూషన్ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. NOV 1 నుంచి నగరంలో BS-4, BS-5 డీజిల్ వాహనాలను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. BS-6 డీజిల్ వాహనాలను మాత్రమే అనుమతించనుంది. దీన్ని సక్రమంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ రూల్ను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు వేయాలంది. అన్ని మేజర్ ఎంట్రీ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


