News February 10, 2025

40 రోజుల్లో 81 మంది హతం

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఈ ఏడాదిలో గత 40 రోజుల్లో మొత్తం 81 మంది ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. గత ఏడాది 217 మంది మావోలు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న ఉదయం జరిగిన కాల్పుల్లో 31 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ప్రకటించారు.

Similar News

News January 5, 2026

J&K మొత్తం ఇండియాలోనే ఉండాలి: బాబ్ బ్లాక్‌మన్

image

POK సహా J&K అంతా ఇండియాలోనే ఉండాలని బ్రిటన్ MP బాబ్ బ్లాక్‌మన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో భారత్‌కు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని జైపూర్లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ సభలో పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370ని తొలగించాలని 1992లోనే చెప్పానన్నారు. కశ్మీరీ పండితులను అక్కడి నుంచి వెళ్లగొట్టడాన్ని వ్యతిరేకించానని గుర్తుచేశారు. మతం పేరిట ప్రజలను వెళ్లగొట్టడం అన్యాయమని ప్రపంచానికి తెలిపానన్నారు.

News January 5, 2026

IPL ప్రసారంపై బ్యాన్.. బంగ్లా సంచలన నిర్ణయం

image

భారత్‌తో వైరం ముదరడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో IPL ప్రసారంపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బ్యాన్ అమలు చేయాలని బ్రాడ్‌కాస్టర్లను ఆదేశించింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో KKR టీమ్ నుంచి ముస్తాఫిజుర్‌ను <<18748860>>తీసేయడంతో<<>> ఈ వివాదం చెలరేగింది. తాము T20 WC కోసం భారత్‌కు రాబోమని ICCకి BCB <<18761652>>లేఖ<<>> రాసింది. ఈక్రమంలోనే IPL ప్రసారంపై బ్యాన్ విధించింది.

News January 5, 2026

లాప్స్ అయిన పాలసీని రివైవ్ చేస్తే లాభామేనా?

image

లాప్స్ అయిన పాలసీలను మళ్లీ రివైవ్ చేసుకునే అవకాశాన్ని LIC కల్పించింది. దీనివల్ల పలు లాభాలు ఉంటాయి. పాలసీలో చేరినప్పటి వయసు ప్రకారమే తక్కువ ప్రీమియం కొనసాగుతుంది. పాత పాలసీల్లో మినహాయింపులు తక్కువగా ఉంటాయి. కొత్తగా మెడికల్ చెకప్స్ చేయించుకునే అవసరం ఉండదు. కట్టాల్సిన బాకీ ప్రీమియం మొత్తాన్ని మార్చి 2లోపు చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు. 30% డిస్కౌంట్ కూడా ఉంది.