News July 19, 2024
డీఎస్సీకి తొలిరోజు 83% మంది హాజరు

TG: డీఎస్సీ వాయిదా వేయాలన్న ఆందోళనల నడుమ ప్రభుత్వం పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తోంది. నిన్న తొలిరోజు 83% మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 24వేల మందికిగానూ 20వేల మంది పరీక్ష రాసినట్లు విద్యాశాఖ వర్గాలు చెప్పాయి. హాల్టికెట్లలో చిన్నచిన్న తప్పులున్నా అభ్యర్థులను అనుమతించాలని అధికారులు ఆదేశించారు. ఇవాళ రెండోరోజు సెకండరీ గ్రేడ్ టీచర్(SGT) తెలుగు మీడియం పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News November 23, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న MovieRulz

పైరసీ మాఫియా టాలీవుడ్కు పెద్ద తలనొప్పిగా మారింది. iBOMMA, Bappam TV లాంటి సైట్లు బ్లాక్ చేసినా, MovieRulz మాత్రం తన దారులు మార్చుకుంటూ కొనసాగుతోంది. శుక్రవారం విడుదలైన సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే మూవీ రూల్జ్లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్లను అప్లోడ్ చేశారు. ఇప్పటికే iBOMMA రవిపై పోలీసులు విచారణను వేగవంతం చేసినప్పటికీ MovieRulz మాత్రం సవాల్ విసురుతోంది.
News November 23, 2025
నాగచైతన్య కొత్త మూవీ టైటిల్ వచ్చేసింది

అక్కినేని నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రివీల్ చేశారు. ‘వృషకర్మ’ టైటిల్తో నాగచైతన్య యాంగ్రీ లుక్లో ఉన్న పోస్టర్ను Xలో పోస్ట్ చేశారు. చైతూకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ సాలిడ్గా ఉందని మహేశ్ పేర్కొన్నారు. మైథలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్గా నటిస్తున్నారు.
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


