News March 19, 2024

ఏపీలో 83 శాతం పోలింగ్ లక్ష్యం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 2019 ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదవగా, ఈసారి 83 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు SEC వెల్లడించింది. 2019లో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 శాతంలోపే పోలింగ్ నమోదైంది. దీంతో ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. పట్టణాలు, ఏజెన్సీల్లో యువతలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించనుంది. గత ఎన్నికల్లో అత్యల్పంగా విశాఖ వెస్ట్‌లో 56.3 శాతం పోలింగ్ నమోదైంది.

Similar News

News November 2, 2025

MECONలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

image

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<>MECON<<>>) 4 సీనియర్ మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 3 నుంచి డిసెంబర్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBDలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.meconlimited.co.in/

News November 2, 2025

న్యూస్ రౌండప్

image

☛ ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్న CM చంద్రబాబు
☛ ఇవాళ 6PM నుంచి HYD యూసుఫ్‌గూడలో KTR రోడ్ షో
☛ WWC: ACA ఆధ్వర్యంలో VJA ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ LED స్క్రీన్ ఏర్పాటు
☛ 3 గంటలుగా VJA ఎక్సైజ్ ఆఫీసులోనే జోగి రమేశ్

News November 2, 2025

టాస్ గెలిచిన టీమ్ ఇండియా

image

ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, జితేశ్, దూబే, అక్షర్, అర్షదీప్, సుందర్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(C), హెడ్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, ఓవెన్, స్టోయినిస్, బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, అబాట్