News May 12, 2024
85శాతంకు పోలింగ్ పెంచే లక్ష్యం: అల్లూరి కలెక్టర్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత పేర్కొన్నారు. గత ఎన్నికల కన్నా పోలింగ్ శాతం పెంచేందుకు గ్రామస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈసారి 85శాతం వరకు పోలింగ్ పెంచే లక్ష్యం మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. ముందుగా లోక్ సభకు, తరువాత అసెంబ్లీ స్థానానికి ఓటు హక్కు కల్పిస్తున్నామన్నారు.
Similar News
News November 21, 2025
విశాఖ: ‘దళారులకు గంటా వార్నింగ్’

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ భూములకు శనివారం నుంచి పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎకరాకు రూ.20 లక్షలు, 20 సెంట్ల భూమి ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ధర ఇప్పిస్తామని రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. న్యాయమైన రైతుల కోరికలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
News November 21, 2025
నేడు గ్రేటర్ విశాఖ కౌన్సిల్ సమావేశం

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరగనుండగా ఈ సమావేశంలో చర్చించేందుకు మొత్తం 90 అంశాలతో అజెండాను సిద్ధం చేశారు. వీటిలో ప్రధానంగా నగరంలోని వివిధ వార్డుల అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీ, వాటర్సప్లై వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ముందస్తు వ్యూహరచనలో భాగంగా వైసీపీ తరఫున షాడో సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించారు. సమావేశం ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News November 21, 2025
నిర్దిష్ట గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం: కలెక్టర్

వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ గురువారం మాస్టర్ ప్లాన్ రహదారులను పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ 7 మాస్టర్ ప్లాన్ రహదారులను రూ.175 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రహదారుల వల్ల జాతీయ రహదారిపై రద్దీ తగ్గుతుందని అన్నారు. సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.


