News March 10, 2025
850 మందిపై టౌన్ న్యూసెన్స్ కేసులు: VZM SP

జనవరి నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 850 మందిపై టౌన్ న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 11 గంటలు దాటిన తరువాత సరైన కారణం లేకుండా పట్టణంలో సంచరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. అలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తునట్లు చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు.
Similar News
News December 4, 2025
VZM: హోంమంత్రి అధ్యక్షతన నేడు DRC సమావేశం

విజయనగరం కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ వంగలపూడి అనిత అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల ప్రగతి, ప్రజా సేవల అమలు స్థితి, సంక్షేమ పథకాల పురోగతి వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు.
News December 4, 2025
స్క్రబ్ టైఫస్పై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ప్రభుత్వ పరంగా జిల్లాలో ఎటువంటి స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కానప్పటికి ఇతర జిల్లాలలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం సూచించారు. వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలందరూ ఆందోళన చెందవద్దని, అనుమానం ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడవచ్చన్నారు.
News December 4, 2025
స్క్రబ్ టైఫస్పై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ప్రభుత్వ పరంగా జిల్లాలో ఎటువంటి స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కానప్పటికి ఇతర జిల్లాలలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం సూచించారు. వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలందరూ ఆందోళన చెందవద్దని, అనుమానం ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడవచ్చన్నారు.


