News June 6, 2024
86.17% మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఈసీ

జాతీయ పార్టీలకు చెందిన 7,193 మంది అభ్యర్థులు (86.17%) లోక్సభ ఎన్నికల బరిలో నిలిచి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితాలో బీఎస్పీ అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీ 488 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా 97.5% మంది డిపాజిట్ కోల్పోయారు. ఆ తర్వాత స్థానాల్లో సీపీఐ(ఎం)- 57.69%, ఎన్పీపీ- 33.33%, TMC- 10.41%, కాంగ్రెస్- 7.9%, బీజేపీ- 6.12% ఉన్నాయి.
Similar News
News September 11, 2025
ఇంటర్లో ప్రవేశాలు.. రెండు రోజులే ఛాన్స్

TG: ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు ఆన్లైన్ <
News September 11, 2025
నేడు బాపట్ల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యలంకలో తాటి మొక్కలు నాటి ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నగరవనం అటవీ పార్కులో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతో సమావేశమై ఆర్థికసాయం అందజేస్తారు.
News September 11, 2025
వరద బాధితులకు వెంటనే పరిహారం విడుదల చేయాలి: మంత్రి

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ‘పరిహారం అందని వారికి వెంటనే నిధులు విడుదల చేయండి. బాధితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకూడదు. చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు ₹10Cr, ఇతర జిల్లాలకు ₹5Cr విడుదల చేశాం’ అని తెలిపారు.