News April 5, 2024
88.03శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు 88.03% పెన్షన్ల పంపిణీ పూర్తైంది. నిన్న ఉ.7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభించగా.. ఎక్కువ అనారోగ్య సమస్య ఉన్న వారు, వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు అందించారు. మొత్తంగా ఒకటిన్నర రోజుల్లో 57.83 లక్షల మంది లబ్ధిదారులకు ₹1749.53 కోట్లు అందించారు. ఇవాళ కూడా ఉ.7 గంటల నుంచి రా.7 గంటల వరకు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది.
Similar News
News January 5, 2026
వరి మాగాణి మినుములో తుప్పు లేదా కుంకుమ తెగులు

మినుము పూత దశ నుంచి తుప్పు తెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఆకు ఉపరితలం పైన లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న మచ్చలు ఉంటాయి. తర్వాత ఇవి కుంభాకారంలో గుండ్రని మచ్చలుగా మారి కుంకుమ/తుప్పు రంగులో కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ + 1 మి.లీ. డైనోకాప్(లీటరు నీటికి) లేదా లీటరు నీటికి బైలాటాన్ 1గ్రా కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు మందులను మార్చి పిచికారీ చేయాలి.
News January 5, 2026
వాల్నట్స్ వీరు తినకూడదు

వాల్నట్స్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు మెదడు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్నిరకాల సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు, రక్తస్రావ రుగ్మతలు ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, మూత్రపిండాల్లో రాళ్లున్నవారు, శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన వాళ్లు ఇవి తీసుకోకూడదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
News January 5, 2026
USలో తెలుగు యువతి హత్య.. ఇండియాలో నిందితుడి అరెస్ట్?

USలోని మేరీల్యాండ్లో తెలుగు యువతి నిఖిత గొడిశాల(27) హత్యకు గురైన కేసులో నిందితుడు అర్జున్ శర్మ అరెస్ట్ అయినట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఆ కథనాల ప్రకారం.. ఇంటర్పోల్ సాయంతో అతణ్ని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 31న కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్జున్ అదే రోజు తెలివిగా ఇండియాకు పారిపోయివచ్చాడు.


