News July 4, 2024
టన్ను ఇసుక రూ.88

AP: <<13558406>>ఉచిత<<>> ఇసుక విధానంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. గతంలో టన్ను ₹475 చొప్పున విక్రయించారు. కాంట్రాక్టర్, రవాణా ఖర్చు ₹100 తీసేయగా మిగిలిన ₹375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై ఆ మొత్తం కాకుండా రూ.88 వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఆ డబ్బునూ స్థానిక సంస్థలకే కేటాయిస్తారు. ₹88తోపాటు స్టాక్ పాయింట్లో లోడింగ్ ఖర్చు, రవాణా వ్యయాన్ని(దాదాపు ₹100) కలెక్టర్లు ఖరారు చేస్తారు.
Similar News
News April 5, 2026
SRH Vs LSG: పిచ్ రిపోర్ట్ ఇదే..

నేడు ఉప్పల్లో SRH, LSG మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. హోమ్ గ్రౌండ్లో విజయం కోసం ఆరెంజ్ ఆర్మీ పట్టుదలతో ఉంది. ఇక్కడి పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. ఫ్లాట్ ట్రాక్, ఫాస్ట్ ఔట్ఫీల్డ్, చిన్న బౌండరీల వల్ల పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ ఆరంభంలో కొత్త బాల్తో ఫాస్ట్ బౌలర్లకు కలిసి రావొచ్చు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకొని 220-230 పరుగుల టార్గెట్ను ఫిక్స్ చేయొచ్చని అంచనా.
News April 5, 2026
వారంలో బంగారం ధర ఎంత పెరిగిందంటే?

వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. మార్చి 27వ తేదీ నుంచి 10గ్రా. 24 క్యారెట్ల బంగారంపై రూ.5,350 పెరిగింది. 22 క్యారెట్లపై రూ.4,900 పెరుగుదల నమోదైంది. APR 2న మాత్రమే తగ్గుదల కన్పించింది. పశ్చిమాసియా యుద్ధం, ట్రంప్ ప్రకటనలతో స్టాక్ మార్కెట్ల అనిశ్చితి వల్ల బులియన్ మార్కెట్పైనా ప్రభావం పడుతోంది. ప్రస్తుతం HYDలో 24 క్యారెట్ల పసిడి 1,50,930, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,38,350గా ఉంది.
News April 5, 2026
2 వారాలు మైదా మానేస్తే?

కేవలం 2 వారాలు మైదా పక్కన పెడితే శరీరంలో అద్భుతమైన మార్పులు గమనించొచ్చని నిపుణులు చెబుతున్నారు. మైదా వల్ల వచ్చే షుగర్ స్పైక్స్ తగ్గి రోజంతా ఎనర్జీ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఉండదు. కాబట్టి దీన్ని మానేస్తే జీర్ణక్రియ మెరుగై గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావు. మైదాకు బదులు తృణధాన్యాలు తింటే ఆకలి త్వరగా వేయదు. వెయిట్ లాస్ కూడా ఈజీ అవుతుంది. విటమిన్లు, మెగ్నీషియం పెరిగి చర్మం మెరుస్తుంది.


