News June 4, 2024

8,806 ఓట్లతో గోడం నగేశ్ ముందంజ

image

ఆదిలాబాద్‌లో పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి 5,660 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి 19,623, బీజేపీ అభ్యర్థి 28,429 ఓట్లు సాధించారు. కాగా బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ 8,806 ఓట్లతో అధిక్యంలో ఉన్నారు.

Similar News

News July 9, 2025

ADB: ఆగస్టు 3న టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ పరీక్ష

image

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (లోయర్ గ్రేడ్) రాత పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు డీఈవో శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెలిపారు. మే, జూన్ 2025లో నిర్వహించిన 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్స్‌లో ఫెయిలైన విద్యార్థుల కోసం హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఆగస్టు 3న పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News July 9, 2025

ADB: పోలీసుల విధులకు ఆటంకం కలిగించి 9 మందిపై కేసు

image

గత నెల 27న నేరేడుగొండలో రోడ్డుపై బైఠాయించి పోలీసు విధులకు ఆటంకం కలిగించి తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి, నలుగురిని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, పోలీసు విధులను ఆటంకపరిచేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News July 8, 2025

ADB నుంచి JBSకు నాన్ స్టాప్ BUS

image

ఆదిలాబాద్ నుంచి జేబీఎస్‌కు ఈనెల 10 నుంచి నాన్ స్టాప్ ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ సర్వీస్ ఆదిలాబాద్ నుంచి ఉదయం 4.45 గంటలకు బయలుదేరి బైపాస్ మీదుగా ఉదయం 10:15 గంటలకు JBS చేరుకుంటుందన్నారు. సాయంత్రం 05.30కి అక్కడి నుంచి బయలుదేరి సింగిల్ స్టాప్ నిర్మల్ వెళ్లి ADBకు రాత్రి 11.15కి వస్తుందని చెప్పారు.