News June 6, 2024
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు 897 కేంద్రాలు: TGPSC

TG: ఈ నెల 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లో 897 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఎగ్జామ్స్ను సజావుగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు ఒక అడిషనల్ కలెక్టర్తోపాటు ఓ ఉన్నతాధికారిని నియమించామన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ కోసం ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు.
Similar News
News October 14, 2025
భారత తొలి IFS అధికారిణి గురించి తెలుసా?

మధ్యతరగతి మహిళ గడప దాటడమే కష్టమైన రోజుల్లో ధైర్యంగా బడికెళ్లి చదువుకున్నారు IFS అధికారిణి ముత్తమ్మ. ‘ఇది మహిళల సర్వీస్ కాదు’ అన్న UPSC ఛైర్మన్ లింగ వివక్షనూ ఎదుర్కొన్నారామె. వివాహిత మహిళల సర్వీసు హక్కు కోసం సుప్రీంలో పోరాడారు. 1949లో తొలి IFS అధికారిణిగా నియమితులై చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచిన ముత్తమ్మ 2009లో చనిపోయారు. * ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 14, 2025
పట్టుచీర కట్టిన తర్వాత..

ప్రతీ పండుగకు ఒక పట్టుచీర తీసి కడుతుంటారు మగువలు. అయితే వీటిని ప్రతిసారీ వాష్ చేస్తే పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. * కొత్త చీరలపై ఏవైనా మరకలు పడితే, ఆ ప్రాంతం వరకే శుభ్రం చేయ్యాలి. * చాలామంది కొత్త చీరలను డిటర్జెంట్, షాంపూలతో వాష్ చేస్తారు. అప్పుడు గాఢత తక్కువ ఉన్నవాటిని వాడాలి. * చీరలను కలిపి ఉతికేటపుడు వేటికవే విడిగా ఉతకాలి. లేదంటే రంగులు అంటుకోవచ్చు.
News October 14, 2025
IPS ఆత్మహత్య.. డీజీపీకి ‘సెలవు’

హరియాణాలో తెలుగు IPS పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న DGP శత్రుజిత్ కపూర్ను ప్రభుత్వం ‘బలవంతపు సెలవు’పై పంపింది. రోహ్తక్ SP నరేంద్ర బిజార్నియాపై ఇప్పటికే బదిలీ వేటు వేసింది. ఉన్నతాధికారుల కులవివక్ష వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పూరన్ భార్య, IAS అమ్నీత్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.