News January 31, 2025

8th Pay Commission: జీతాలు 10 నుంచి 30% మాత్ర‌మే పెంపు?

image

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌న పెంపు కోసం ఏర్పాటైన 8వ వేత‌న స‌వ‌ర‌ణ సంఘం 2025 చివ‌రిక‌ల్లా నివేదిక స‌మ‌ర్పించ‌నుంది. అయితే కొన్ని ఊహాగానాల మేర‌కు ఉద్యోగుల వేత‌నాలు ప్ర‌చారంలో ఉన్న‌ట్టు 186% మేర కాకుండా 10 నుంచి 30% మాత్ర‌మే పెరిగే అవ‌కాశం ఉందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగులు ఆశిస్తున్న 2.86% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అసాధ్య‌మ‌ని మాజీ ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గర్గ్ పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

ఒక్క వ్యక్తి ఆధారంగా రిజర్వేషన్.. ఎన్నిక బహిష్కరణ

image

TG: STలే లేని పంచాయతీకి ST రిజర్వేషన్ ప్రకటించడంతో నల్గొండ(D) అనుముల(M) పేరూరు గ్రామస్థులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. గతంలో పేరూరు, వీర్లగడ్డ తండా కలిపి ఉమ్మడి పంచాయతీగా ఉండేవి. తరువాత రెండూ విడిపోయాయి. ఆ సమయంలో తప్పుగా నమోదైన ఒకే ఒక్క ఎస్టీ వ్యక్తిని ఆధారంగా తీసుకుని పేరూరు రిజర్వేషన్ కేటాయించారు. ST అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేదు. దీనిపై గ్రామస్థులు HCని ఆశ్రయించారు.

News December 4, 2025

వైసీపీ వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యం: నారాయణ

image

AP: వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ విమర్శించారు. బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించే నాటికి వర్షాలు ముంచెత్తాయని చెప్పారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రెండో విడత భూసమీకరణపై గ్రామస్థులతో సమావేశమయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని పేర్కొన్నారు.

News December 4, 2025

ENCOUNTER: 19కి చేరిన మృతుల సంఖ్య

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన <<18460138>>ఎన్‌కౌంటర్‌లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 19 మంది మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్లా మోడియం కూడా ఉన్నారు. భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు ఎదురుకాల్పుల్లో నిన్న ముగ్గురు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే.