News March 6, 2026

9న ఆదిలాబాద్ ITI కళాశాలలో అప్రెంటిషిప్ మేళా

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కావున జిల్లాలోని ITI ఉత్తీర్ణులైన విద్యార్థులు https://www.apprenticeshipindia.gov.in/mela Registration ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. శిక్షణ కాలంలో స్టైఫండ్ అందజేస్తామని తెలిపారు.

Similar News

News April 13, 2026

ఆదిలాబాద్: ఇంటర్ ఫలితాలపై అధికారుల ఆరా..!

image

ఆదిలాబాద్ జిల్లా ఇంటర్ ఫలితాల్లో తీవ్రంగా వెనుకబడింది. మొదటి సంవత్సరంలో 32వ ర్యాంకు (50.77%), ద్వితీయ సంవత్సరంలో 33వ ర్యాంకు (62.50%) సాధించింది. ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఫలితం లేకపోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా బాలుర ఉత్తీర్ణత తగ్గడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో పర్యవేక్షణ లోపం, విద్యార్థుల గైర్హాజరు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ ఫలితాలు.. ADBకు 33వ ర్యాంకు

image

ఇంటర్ సెకండియర్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదిలాబాద్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 7,518 మంది పరీక్షలు రాయగా 4,699 మంది పాసై 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 905 మందికి 669 మంది పాసై73.95 శాతంతో 18వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 452 మందికి 162 మంది పాసై 35.84%తో 8వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 53 మందికి 15 మంది పాసై 28.30%తో 34వ ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. 32వ స్థానంలో ADB

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ADB జిల్లా 50.77% ఉత్తీర్ణతతో 32వ స్థానంలో నిలిచింది. మొత్తం 7,701 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 3,910 మంది పాస్ అయ్యారు. బాలురు 3,773 మంది పరీక్ష రాయగా 1,391 మంది 36.87% పాస్ అయ్యారు. బాలికలు 3,928 మందికి గాను 2519 మంది 64.13% ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఒకేషనల్‌లో 935 మంది పరీక్ష రాయగా 620 మంది పాసై 66.31 శాతంతో స్టేట్‌లో 9వ స్థానంలో నిలిచింది.