News March 12, 2025

9వ తరగతి విద్యార్థులకు ఇస్రో పిలుపు: పార్వతీపురం డీఈవో 

image

9వ తరగతి విద్యార్థులకు ఇస్రో నుంచి పిలుపు వచ్చిందని డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. యంగ్ సైంటిస్ట్ -2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఎనిమిదో తరగతిలో 50 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తును ఈ నెల 23వ తేదీలోగా ఆన్‌లైన్లో నాలుగు దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు విద్యార్థుల వద్ద నుంచి 40అప్లికేషన్లు వచ్చినట్లు ఆయన తెలిపారు.

Similar News

News December 2, 2025

ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు నోటిఫికేషన్

image

ఏయూలో స్పెష‌ల్ డ్రైవ్ ప‌రీక్ష‌ల‌కు కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ అధికారి టి.చిట్టిబాబు నోటిఫికేష‌న్‌‌ విడుద‌ల చేశారు. 2010-11 సంవ‌త్స‌రం నుంచి 2025 వ‌ర‌కు డిగ్రీ, పీజీ ప్ర‌వేశం పొందిన విద్యార్థులు స్పెష‌ల్ డ్రైవ్ ప‌రీక్ష‌ల‌కు అర్హులుగా ఆయన పేర్కొన్నారు. డిసెంబ‌ర్ 4 నుంచి 26వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు.

News December 2, 2025

HYD: ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

image

హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్ళపై ఐటీ శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. వుడ్‌బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్‌ను ఐటీ అధికారులు విచారించారు. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ వంటి హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలపై, ఇతర హోటళ్లతో ఉన్న సంబంధాలపై ఐటీ శాఖ దృష్టి సారించి పరిశీలన జరుపుతోంది.

News December 2, 2025

భూపాలపల్లి: 3న దివ్యాంగుల దినోత్సవం

image

జిల్లాలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమావేశం హాల్‌లో ఈ వేడుక జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లిశ్వరి తెలిపారు. జిల్లాలోని అన్ని రకాల దివ్యాంగులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె కోరారు.