News March 12, 2025
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో పిలుపు: పార్వతీపురం డీఈవో

9వ తరగతి విద్యార్థులకు ఇస్రో నుంచి పిలుపు వచ్చిందని డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. యంగ్ సైంటిస్ట్ -2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఎనిమిదో తరగతిలో 50 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తును ఈ నెల 23వ తేదీలోగా ఆన్లైన్లో నాలుగు దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు విద్యార్థుల వద్ద నుంచి 40అప్లికేషన్లు వచ్చినట్లు ఆయన తెలిపారు.
Similar News
News March 12, 2025
బిక్కనూర్: కంటి అద్దాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

దృష్టి లోపం ఉన్న వారు కంటి అద్దాలు వాడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దృష్టి లోపం ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివప్రసాద్, కంటి వైద్యాధికారి రవీందర్ ఉన్నారు.
News March 12, 2025
గవర్నర్కు KTR క్షమాపణలు చెప్పాలి: మహేశ్ కుమార్

TG: గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచేలా KTR <<15732904>>మాట్లాడారని <<>>పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారం పోయినా, ఆయనలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. KTR గవర్నర్కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు ప్రతిపక్ష నేతగా KCR అసెంబ్లీకి రావడాన్ని మహేశ్ కుమార్ స్వాగతించారు. ప్రభుత్వానికి KCR సలహాలు ఇవ్వాలని సూచించారు.
News March 12, 2025
ఇల్లు కట్టుకున్నవారికి అదనపు లబ్ధి: కలెక్టర్

2016-17 నుంచి 2023-24 వరకు పీఎంఏవై ద్వారా గృహాలు మంజూరై నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నవారికి ప్రభుత్వం అదనపు సహాయం అందజేస్తుందని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్న లబ్ధిదారులలో ఎస్సీలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.