News April 10, 2025
రాజీవ్ యువ వికాసానికి 9.5 లక్షల దరఖాస్తులు

TG: నిరుద్యోగుల ఉపాధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే 9.5 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 14న తుదిగడువు కాగా ఆలోపు దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం లేదు.
Similar News
News April 18, 2025
IPL: సన్రైజర్స్ ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే?

పేలవ ఆటతీరుతో SRH నిరాశపరుస్తోంది. 7 మ్యాచులు ఆడి కేవలం రెండే గెలవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే మిగతా 7 మ్యాచుల్లో కచ్చితంగా 6 గెలవాలి. ఒకవేళ 5 గెలిస్తే నెట్ రన్రేట్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉండాలి. కానీ ప్రస్తుతం కమిన్స్ సేన NRR -1.217గా ఉంది. ఇది పాజిటివ్లోకి రావాలంటే భారీ తేడాలతో విజయాలు సాధించాల్సి ఉంటుంది. మరి SRH ప్లేఆఫ్స్కు వెళ్తుందా? కామెంట్ చేయండి.
News April 18, 2025
IPL: గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్

గాయం కారణంగా ఐపీఎల్-2025కు దూరమైన గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ మరో ఆటగాడిని తీసుకుంది. శ్రీలంక ఆల్ రౌండర్ దసున్ శనకను రూ.75లక్షలకు జాయిన్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. శనక 2023 సీజన్లో GTకి 3 మ్యాచులు ఆడి 26 పరుగులు చేశారు. ఆ తర్వాత ఐపీఎల్లో అతడికి అవకాశం రాలేదు. మీడియం పేస్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగల శనక మిడిలార్డర్లో తమకు బలంగా మారతాడని GT యాజమాన్యం భావిస్తోంది.
News April 18, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలో రానున్న 5రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయంది. మరోవైపు, మిగతా ప్రాంతాల్లో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది.