News September 5, 2025
రబీ సీజన్కు 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

AP: రబీ సీజన్ కోసం 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. యూరియా స్టాక్, సప్లై, పంపిణీపై పలు జిల్లాల కలెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో యూరియా కొరత ఉంది. ఆ జిల్లాల్లో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి. యూరియా నిల్వల్లో తేడా లేకుండా చూసుకోవాలి’ అని ఆదేశించారు.
Similar News
News September 5, 2025
ఇలాంటి వారిని అభినందించాల్సిందే❤️

రాత్రి వేళల్లో ఎంతో మంది మహిళలను సురక్షితంగా ఇంటికి చేర్చుతున్న చెన్నైకి చెందిన లేడీ ఆటో డ్రైవర్ రాజీ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమె దాదాపు 20 ఏళ్లుగా నగరంలో ఆటో నడుపుతూ వేలాది మంది అభిమానాన్ని పొందారు. మహిళలకు అర్ధరాత్రి ఏ అవసరమొచ్చినా ఆమె ఆటో సిద్ధంగా ఉంటుంది. రాజీ మహిళలకు ఉచితంగా ఆటో నేర్పించడమే కాకుండా పిల్లలు, వృద్ధులు, పేదవారికి ఉచిత ప్రయాణం అందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
News September 5, 2025
స్కాంల కోసం మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం: జగన్

AP: ప్రజల ఆస్తులను CM చంద్రబాబు తనవాళ్లకు పప్పుబెల్లాల్లా పంచుతున్నారని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కాంల కోసం ప్రైవేటుపరం చేస్తున్నారు. మా 5ఏళ్లలో 17కాలేజీల్లో 5చోట్ల క్లాసులు ప్రారంభమయ్యాయి. మిగతా పనులు మీరు బాధ్యతగా చేసి ఉంటే మరో 12 కాలేజీల్లోనూ క్లాసులు స్టార్ట్ అయ్యేవి. మేం అధికారంలోకి రాగానే ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం’ అని ట్వీట్ చేశారు.
News September 5, 2025
హైదరాబాద్ వల్లే తెలంగాణ నంబర్వన్: చంద్రబాబు

AP: ఎంతో ఇష్టంతో తాను HYDను అభివృద్ధి చేశానని, దాని వల్లే TG నంబర్వన్గా నిలిచిందని CM చంద్రబాబు అన్నారు. అలాగే దేశంలో ఏపీని నంబర్వన్గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న టీచర్స్ డే కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్వన్గా నిలవాలి. రాబోయే 22 ఏళ్లపాటు మనమంతా దీనిపై దృష్టి సారిస్తే సాధ్యమే. విజన్ 2047 కోసం శ్రమిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు.