News July 8, 2024

పేటీఎం షేర్లలో 9% వృద్ధి!

image

సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పేటీఎంకు ఈరోజు ట్రేడింగ్‌లో సూచీలు ఊరటనిచ్చాయి. గరిష్ఠంగా 9.87% వృద్ధిని నమోదు చేసిన ఆ సంస్థ షేర్లు ప్రస్తుతం 8.11% ప్రాఫిట్‌తో ₹472 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత ఆ సంస్థ షేర్లు ₹310-440 మధ్య కొనసాగుతున్నాయి. తాజాగా ₹36 వృద్ధి చెంది ₹500 మార్క్‌కు చేరువ అవుతుండటంతో ఇన్వెస్టర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

image

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్‌తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్‌లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.

News November 18, 2025

జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

image

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్‌తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్‌లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.

News November 18, 2025

రేపే అకౌంట్లలోకి రూ.7వేలు.. మీ పేరు ఉందా?

image

PM కిసాన్ 21వ విడత నిధులను కేంద్రం రేపు విడుదల చేయనుంది. అర్హులైన రైతుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.2 వేల చొప్పున ప్రధాని మోదీ జమచేస్తారు. అదే రోజున AP ప్రభుత్వం 2వ విడత అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతులకు రూ.5వేల చొప్పున అందించనుంది. దీంతో ఈ 2 పథకాలకు అర్హులైన రైతుల అకౌంట్లలో రేపు రూ.7వేలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.