News December 14, 2024
రాష్ట్రంలో 9లక్షల కేసులు పెండింగ్

AP: రాష్ట్రంలో 9 లక్షల పెండింగ్ కేసులు ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. టీడీపీ MP పుట్టా మహేశ్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఏపీ హైకోర్టు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో గత మంగళవారం వరకు 8,99,895 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 65,848 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు రాతపూర్వకంగా తెలియజేశారు.
Similar News
News November 20, 2025
కరీంనగర్: డయల్ 100కు 47,481 కాల్స్

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ‘విజిబుల్ పోలీసింగ్ సిస్టం’ పకడ్బందీగా అమలవుతోంది. డయల్ 100 ద్వారా ఈ మధ్య కాలంలో 47,481 కాల్స్ రాగా, అందులో 2,547 ప్రమాదాలు, 493 ఆత్మహత్యాయత్నాలు, 5,961 మహిళల పట్ల అసభ్య ప్రవర్తన కేసులు ఉన్నాయి. దీంతో ఘటన ఏదైనా డయల్ 100కు కాల్ చేయాలన్న చైతన్యం ప్రజల్లో పెరిగినట్లు స్పష్టమవుతోంది.
News November 20, 2025
బాబు లుక్స్ అదిరిపోయాయిగా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘వారణాసి’ మూవీ కోసం హైదరాబాద్లో హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. బాబు కోసం హాలీవుడ్ HYDకు వచ్చిందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఆయన లుక్స్ అదిరిపోయాయని, మూవీ విడుదలయ్యే వరకు ఇలా ఫొటోల్లో కనిపించినా చాలని మరికొందరు అంటున్నారు.
News November 20, 2025
ఆవుల డెయిరీ, గేదెల డెయిరీ.. దేనితో లాభం?

స్థానికంగా ఆవు, గేదె పాలకు ఉన్న డిమాండ్ బట్టి ఫామ్ ప్రారంభించాలి. గేదె పాలకు అధిక ధర వస్తున్నా, స్థానిక గేదెలు తక్కువ పాలివ్వడం, అధిక పాలిచ్చే ముర్రాజాతి గేదెల ధర ఎక్కువ కావడం, సకాలంలో ఎదకు రాకపోవడంతో చాలా మంది నష్టపోతున్నారు. అందుకే ఏడాదిలో 280-300 రోజుల పాటు అధిక పాల దిగుబడినిచ్చే జెర్సీ, హోలిస్టిన్ ఫ్రీజియన్ ఆవులతో ఫామ్ నడపడం మేలంటున్నారు నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.


