News July 25, 2024

ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.9వేల కోట్లు!

image

TG: రాష్ట్ర బడ్జెట్‌ నుంచి సాగునీటి రంగంలో ఎక్కువభాగం ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాల చెల్లింపులకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం ₹29వేల కోట్లు ఈ రంగానికి కేటాయించే అవకాశం ఉండగా అందులో ₹18వేల కోట్లు రుణాలకు, ₹9 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి ఇవ్వనున్నట్లు సమాచారం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులకు నిధులిచ్చే అంశంపై ఇటీవల మంత్రి ఉత్తమ్ అధికారులతో సమీక్షించారు.

Similar News

News February 2, 2026

పీసీబీ ప్రకటనపై స్పందించిన ఐసీసీ

image

భారత్‌తో T20WC మ్యాచ్‌ను బహిష్కరిస్తామన్న <<19024958>>PCB<<>> ప్రకటనపై ICC స్పందించింది. పీసీబీ నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని పేర్కొంది. ఈ ప్రకటన అంతర్జాతీయ క్రీడా సమగ్రతను దెబ్బతీస్తుందని, పాకిస్థాన్‌లోనూ క్రికెట్‌పై దీర్ఘకాలిక పరిణామాలు ఉండవచ్చని పేర్కొంది. దీనిపై పున:పరిశీలన చేయాలంది. జాతీయ విధానాలను తాము గౌరవిస్తామని, అయితే అందరికీ ఆమోదమైన నిర్ణయాన్ని PCB తీసుకోవాలని ఆకాంక్షించింది.

News February 2, 2026

కరోండా మొక్కలతో పంటకు రక్షణ, ఆదాయం

image

పంట రక్షణకు నేడు ఇనుప వైర్ ఫెన్స్, కాంక్రీటు స్తంభాలు వేయడానికి చాలా ఖర్చవుతుంది. అయితే పంటకు సహజ రక్షణ కవచంలా నిలుస్తోంది ‘కరోండా’. వీటినే వాక్కాయ మొక్కలు అంటారు. ఇవి చిన్న పొద రూపంలో పెరుగుతాయి. వీటి కాండం, కొమ్మలు ముళ్లతో నిండి పంటకు సహజ రక్షణ కవచంలా నిలుస్తాయి. ఈ మొక్కలకు ఉండే కాయలతో రైతులకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. కరోండాను ఎలా పెంచాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News February 2, 2026

కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

image

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.