News July 25, 2024
ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.9వేల కోట్లు!

TG: రాష్ట్ర బడ్జెట్ నుంచి సాగునీటి రంగంలో ఎక్కువభాగం ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాల చెల్లింపులకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం ₹29వేల కోట్లు ఈ రంగానికి కేటాయించే అవకాశం ఉండగా అందులో ₹18వేల కోట్లు రుణాలకు, ₹9 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి ఇవ్వనున్నట్లు సమాచారం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులకు నిధులిచ్చే అంశంపై ఇటీవల మంత్రి ఉత్తమ్ అధికారులతో సమీక్షించారు.
Similar News
News February 5, 2026
T20WC: టీమ్ ఇండియాకు గాయాల భయం!

రెండ్రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అవుతుండటంతో ఇద్దరు టీమ్ ఇండియా ప్లేయర్ల ఫిట్నెస్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. నిన్న SAతో జరిగిన వార్మప్ మ్యాచ్లో హర్షిత్ రాణా ఒకే ఓవర్ వేసి కాసేపటికే మైదానాన్ని వీడారు. ఏదో నొప్పితో బాధపడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. న్యూజిలాండ్ సిరీస్లో గాయపడిన సుందర్ ఇంకా కోలుకోలేదు. ఎప్పుడు జట్టుకు అందుబాటులోకి వస్తారన్న దానిపై స్పష్టత లేదు.
News February 5, 2026
$400bn మార్కును దాటిన గూగుల్ రెవెన్యూ: సుందర్ పిచాయ్

గూగుల్ యాన్యువల్ రెవెన్యూ తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసిందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. FY25 Q4 ఫలితాలను ఆయన వెల్లడించారు. 2025లో యూట్యూబ్ రెవెన్యూ 60 బిలియన్ డాలర్లను దాటినట్లు పేర్కొన్నారు. జెమినీ యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 750M+గా ఉన్నట్లు చెప్పారు. AI స్టాక్, జెమినీ 3 అడాప్షన్ తమ కంపెనీ ప్రోగ్రెస్కి ఫ్యూయల్లా పనిచేస్తున్నాయని వివరించారు.
News February 5, 2026
ఎయిమ్స్ గోరఖ్పూర్లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

<


