News April 24, 2025

90 శాతం సమస్యలు ఎమ్మార్వో వద్దనే పరిష్కారమవుతాయి: జనగామ కలెక్టర్

image

భూ భారతి చట్టంతో 90 శాతం వరకు సమస్యలు తహశీల్దార్ల వద్దనే పరిష్కారమవుతాయని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి ఆర్ఓఆర్ చట్టాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారానికి మంచి అవకాశం ఉన్న దృశ్యా ఈ చట్టంపై జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Similar News

News December 21, 2025

SKLM: ‘చిన్నారులకు పోలియో రక్షణ కవచం’

image

జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఎచ్చెర్లలోని పూడివలసలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 1,55,876 మంది చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

News December 21, 2025

పర్ణశాలలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు

image

దుమ్ముగూడెం: పర్ణశాల రామాలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 2:30 గంటలకు హరికథా కాలక్షేపం నిర్వహించగా, సాయంత్రం 4 గంటలకు స్వామివారి తిరువీధి సేవను కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

News December 21, 2025

కామారెడ్డి జిల్లా తపస్ అధ్యక్షుడిగా బూనేకర్ సంతోష్

image

కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బూనేకేర్ సంతోష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు తపస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడు రవీంద్రనాథ్ ఆర్య ప్రకటించారు. అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై ఉపాధ్యాయులతో కలిసి ఉద్యమిస్తానన్నారు. మాజీ అధ్యక్షుడు రవీందర్ ఉన్నారు.