News June 28, 2024

90 శాతం బిలియనీర్లు అగ్ర కులాల వారే!

image

దేశంలోని దాదాపు 90 శాతం మంది బిలియనీర్లు అగ్ర కులాలకు చెందినవారేనని వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ నివేదికలో తేలింది. సంపదంతా అగ్రకులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. బిలియనీర్ల జాబితాలో ఎస్టీలు లేరని తెలిపింది. టాప్ 1 శాతం మిలియనీర్ల జనాభా దేశంలోని మొత్తం సంపదలో 40 శాతానికిపైగా నియంత్రిస్తున్నట్లు పేర్కొంది. 2014-15 నుంచి 2022-23 మధ్య సంపద కేంద్రీకరణ పరంగా అసమానతలు పెరిగాయని తెలిపింది.

Similar News

News September 20, 2024

పేజర్లు, వాకీటాకీలపై విమానాల్లో నిషేధం

image

పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో వణికిపోతున్న లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ రాజధాని బీరుట్ నుంచి వెళ్లే విమానాల్లో వాటిని తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. విమాన ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా చెక్ చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. కాగా వాకీటాకీలు, పేజర్లు పేలుడు ఘటనల్లో 30 మందికి పైగా చనిపోగా, వేలాది మంది గాయపడ్డారు.

News September 20, 2024

పట్టాలపై 6 మీటర్ల ఇనుప స్తంభం.. తప్పిన ప్రమాదం

image

లోకో పైలట్ అప్రమత్తతతో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ వద్ద పట్టాలపై 6 మీటర్ల ఇనుప స్తంభం ఉన్నట్లు జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ గుర్తించాడు. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేసి రైలును ఆపేయడంతో ప్రమాదం తప్పింది. పోల్ తీసేసిన తర్వాత రైలు అక్కడి నుంచి ముందుకు కదిలింది. కాగా ఇటీవల పట్టాలపై రాళ్లు, సిమెంట్ దిమ్మెలు, సిలిండర్లు ఉంచిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

News September 20, 2024

ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలవనున్నాయి. ఇవాళ APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని APSDMA వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, ఉ.గో, కృష్ణా, NTR, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. TGలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఎల్లుండి వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది.