News April 24, 2025
90 శాతం సమస్యలు ఎమ్మార్వో వద్దనే పరిష్కారమవుతాయి: జనగామ కలెక్టర్

భూ భారతి చట్టంతో 90 శాతం వరకు సమస్యలు తహశీల్దార్ల వద్దనే పరిష్కారమవుతాయని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి ఆర్ఓఆర్ చట్టాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారానికి మంచి అవకాశం ఉన్న దృశ్యా ఈ చట్టంపై జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Similar News
News April 25, 2025
కాజీపేట: భార్య భర్తలు అదృష్యం

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ కాలనీకి చెందిన భార్య భర్తలు సందీప్ కుమార్(44), మానస(40) 21 రోజుల క్రితం అదృష్యం అయ్యారని కాజీపేట ఎస్సై నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా వారి తండ్రి సంపత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా వీరి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.
News April 25, 2025
పాకిస్థాన్పై భారత్ ఘన విజయం

ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆ దేశంపై భారత ఉమెన్స్ బేస్బాల్ టీమ్ అదరగొట్టింది. ఆసియా కప్ క్వాలిఫయర్స్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించింది.
News April 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.