News February 12, 2025
93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ: శ్రీధర్ బాబు

రాష్ట్రంలోని 93 లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకురానున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించినట్టు సచివాలయంలో తనను కలిసిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందానికి వివిరించారు. పైలట్ ప్రాజెక్టు కింద డిజిటలైజేషన్ చేపట్టిన 4 గ్రామాలను ఈ బృందం సందర్శించి తమ అనుభవాలను మంత్రితో పంచుకుంది.
Similar News
News December 8, 2025
గద్వాల: ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి: ఎస్పీ

గద్వాల జిల్లాలో ఎన్నికలలో శాంతిభద్రతలే ప్రధానమని, ఓటర్లు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పక పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల వేళ గ్రామాలలో ఎలాంటి అలజడి సృష్టించినా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News December 8, 2025
NTR: కమిషనరేట్ పీజీఆర్ఎస్కు 82 ఫిర్యాదులు

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో మొత్తం 82 ఫిర్యాదులు స్వీకరించారు. డీసీపీ శ్రీ ఎస్.వి.డి. ప్రసాద్, ఏడీసీపీ శ్రీ ఎం. రాజారావు బాధితుల సమస్యలను నేరుగా విన్నారు. భూవివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలు, మహిళా సమస్యలపై ఈ ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
News December 8, 2025
రేణుకా చౌదరికి ప్రివిలేజ్ నోటీసులు

TG: పార్లమెంటు సభ్యులపై <<18438395>>అనుచిత<<>> వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరిపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. బ్రిజ్లాల్, గోపాలస్వామి ఆమెపై రాజ్యసభ ఛైర్మన్కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వాటిని ఆయన ప్రివిలేజ్ కమిటీకి పంపారు. ఇటీవల ఆమె పార్లమెంటుకు పెంపుడు కుక్కను తీసుకెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పరోక్షంగా ఎన్డీఏ సభ్యులను ఉద్దేశిస్తూ కరిచే వాళ్లు లోపల ఉన్నారని వ్యాఖ్యానించారు.


