News April 6, 2024
93.42శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

AP: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ 93.42 శాతం పూర్తయింది. 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1874.85 కోట్లను ప్రభుత్వం అందించింది. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇళ్ల వద్దే పింఛన్లు అందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. నేడు కూడా ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సచివాలయాల వద్ద పెన్షన్లు అందిస్తామని అన్నారు.
Similar News
News January 19, 2026
వెకేషన్లో నయన్- త్రిష.. 40ల్లోనూ తగ్గని గ్లామర్!

స్టార్ హీరోయిన్లు నయనతార, త్రిష మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లకు ఈ ఫొటోలతో చెక్ పడింది. దుబాయ్లో ఒక లగ్జరీ బోట్పై చిల్ అవుతున్న ఫొటోలను నయన్ షేర్ చేశారు. ‘ముస్తఫా ముస్తఫా don’t worry ముస్తఫా.. కాలం నీ నేస్తం ముస్తఫా’ అని రాసుకొచ్చారు. 40 ఏళ్లు దాటినా వీరి గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ డ్రీమ్ గర్ల్స్లా మెరిసిపోతున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.
News January 19, 2026
CBN వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి లోకేశ్

AP: ఏడాదిన్నరలో రాష్ట్రానికి రూ.23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటివల్ల 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలొస్తాయని దావోస్లో మంత్రి లోకేశ్ తెలిపారు. అభివృద్ధి, ఐటీ, క్వాంటమ్ అంటూ ఏపీని సీబీఎన్ నడిపిస్తున్నారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఆయనే కారణమన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 11 మంది ఏడుపుగొట్టు టీమ్ పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోందని పరోక్షంగా వైసీపీని విమర్శించారు.
News January 19, 2026
ఇతిహాసాలు క్విజ్ – 128 సమాధానం

ప్రశ్న: అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలిసినా, బయటకు రావడం ఎందుకు తెలియదు?
సమాధానం: అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానం గురించి వివరిస్తుంటే విన్నాడు. అయితే, వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చెప్పే సమయానికి సుభద్ర నిద్రపోయింది. దీంతో గర్భంలో ఉన్న అభిమన్యుడికి లోపలికి వెళ్లడం మాత్రమే తెలిసింది. బయటకు రావడం తెలియలేదు.
<<-se>>#Ithihasaluquiz<<>>


