News May 19, 2024

ఈఏపీసెట్ పరీక్షకు 94శాతం హాజరు

image

ఏపీ ఈఏపీసెట్-2024 ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగినట్లు సెట్ ఛైర్మన్, వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 31,386 మంది విద్యార్థులకు గాను 29,543(94.13%) మంది హాజరైనట్లు పేర్కొన్నారు. 1843 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. కాగా ఈ నెల 23వరకు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.

Similar News

News December 1, 2025

అల్లూరి: నిర్వాసితులకు రేషన్ కష్టాలు.. 290 కి.మీ ప్రయాణం

image

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రేషన్ పంపిణీ విషయంలో స్థానికత సమస్య ఎదురవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి రేషన్ బదిలీ కావడం లేదు. ఏలూరు జిల్లా నుంచి బియ్యం ఇవ్వడం లేదు. దీంతో నిర్వాసితులు పాత గ్రామానికి సుమారు 290 కిలోమీటర్లు ప్రయాణించి, వేల రూపాయల కిరాయి చెల్లించి రేషన్ తెచ్చుకుంటున్నారు. పునరావాస గ్రామాలను పోలవరం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

image

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 1, 2025

వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

image

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.