News March 28, 2024
మాస్కో ఉగ్రదాడిలో 95మంది ఆచూకీ గల్లంతు!

గత వారం రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 140మంది చనిపోగా 182మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. అయితే, అధికారుల జాబితాలో లేని మరో 95మంది ఆచూకీ లభ్యం కావడంలేదని బాజా న్యూస్ ఛానల్ తెలిపింది. ఈ మేరకు తమ శోధనలో తేలిందని పేర్కొంది. తమవారేమయ్యారో తెలియడం లేదంటూ గల్లంతైన వారి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించింది.
Similar News
News March 14, 2026
మా డ్రెస్సింగ్తో మీకేంటి సమస్య: రాశీ ఖన్నా

కంఫర్ట్గా ఉండే దుస్తులు ధరించే స్వేచ్ఛ ఏ అమ్మాయికైనా ఉంటుందని హీరోయిన్ రాశీ ఖన్నా అన్నారు. ‘ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది అమ్మాయి ఇష్టం. మేము ఏ దుస్తులు ధరిస్తే మీకేంటి సమస్య’ అని ప్రశ్నించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్లలో ఆమె పాల్గొన్నారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై <<18746820>>చర్చ జరగడాన్ని<<>> ప్రస్తావించగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని, పెళ్లికి ఇప్పుడు సమయం లేదని చెప్పారు.
News March 13, 2026
యుద్ధం.. ఐదుగురు భారతీయులు మృతి

ఒమన్లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. మరోవైపు హార్ముజ్లో చిక్కుకుపోయిన నౌకల్లో ఉన్న భారత నావికుల్లో ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఐదుగురు ఇండియన్స్ ప్రాణాలు విడిచినట్లు అయ్యింది.
News March 13, 2026
టీచర్ ప్రతిరోజు భోజనం నాణ్యత చెక్ చేయాలి: మంత్రి లోకేశ్

AP: మైలవరంలో విద్యార్థులకు నాసిరకం భోజనం <<19370398>>పెట్టడంపై<<>> విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజూ ఒక టీచర్ భోజనం నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు. MLAలు వారానికి ఒక స్కూలును సందర్శించాలని విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. డొక్కా సీతమ్మ పేరుపై నడుస్తున్న భోజన పథకంపై కుట్రలు చేసినా, నాణ్యత తగ్గినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


