News July 27, 2024

98% చర్లపల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తి: కిషన్ రెడ్డి

image

HYD చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.434 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతుందని వెల్లడించారు. కానీ.. ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పలేదు. దీంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Similar News

News December 28, 2025

హైదరాబాద్ కుర్రాడే హిమాలయ శిఖరం!

image

ఒక్కసారి ఊహించుకోండి.. 16 ఏళ్ల వయసులో మనం ఏం చేస్తాం? కానీ మన హైదరాబాద్ కుర్రాడు విశ్వనాథ్ కార్తికేయ మాత్రం ఏకంగా ప్రపంచాన్నే తన పాదాక్రాంతం చేసుకున్నాడు. ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించి (7 Summits Challenge), ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. క్రమశిక్షణతో 2025 మే 27న ఎవరెస్టును ముద్దాడి ఈ ఘనత సాధించాడు.

News December 28, 2025

హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఆదివారం తెల్లవారుజామున 261కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT

News December 28, 2025

HYD: కాళ్ల పారాణి ఆరకముందే.. కాటికి (Rewind)

image

కాళ్ల పారాణి ఆరకముందే ఆడబిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కట్టుకున్నవాడు కంటికి రెప్పలా చూసుకుంటాడని నమ్మితే.. అదనపు కట్నం కోసం వేధించి కాటికి పంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ HYDలో పరిధిలో గత 11 నెలల్లోనే దాదాపు 16 మంది మహిళలు వరకట్న వేధింపులకు బలైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కట్న దాహంతో అత్తారింటి వేధింపులు మితిమీరడంతో వధువుల జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి.