News April 12, 2025
983 మార్కులతో సత్తా చాటిన గొల్లప్రోలు విద్యార్థిని

గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సాయి జ్యోతి 983 మార్కులు సాధించి ఔరా అనిపించింది. పట్టణానికి చెందిన ఆమె MPC విభాగంలో ఈ ఘనత సాధించింది. జ్యోతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివింది. కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాలలో ఎంపీసీ విభాగంగాలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
Similar News
News January 1, 2026
సింగర్ మంగ్లీ ఈవెంట్లో విషాదం?

AP: సింగర్ మంగ్లీ ఈవెంట్లో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో శుభారంభ్ పేరుతో నిర్వహిస్తున్న న్యూఇయర్ వేడుకల్లో ఓ యువకుడు చనిపోయాడని సమాచారం. వేణుగోపాల్ నగర్కు చెందిన షౌకత్ కరెంట్ షాక్తో మృతి చెందాడని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేడుకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
News January 1, 2026
KMM: ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కల్లూరులో పర్యటించిన ఆయన కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, లబ్ధిదారులు నిర్మించుకున్న ఇంటి పురోగతిని బట్టి ప్రతి సోమవారం నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు.
News January 1, 2026
ATP: చేతివాటం ప్రదర్శించిన బేకరీల యజమానులు

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలోని కొందరు బేకరీ షాపుల యజమానులు చేతివాటం ప్రదర్శించారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్ తనిఖీలు చేపట్టగా తూకాల్లో మోసం వెలుగు చూసింది. 1 కిలో కేక్కి 200 గ్రాములు తగ్గింది. కణేకల్, ఉరవకొండ, విడపనకల్లులో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. కణేకల్లులోని 2 షాపుల్లో రూ.20 వేలు, ఉరవకొండలో 4 షాపుల్లో రూ.41వేలు, విడపనకల్లులో 3 షాపుల్లో రూ. 27వేలు జరిమానా విధించారు.


