News October 23, 2024
99 శాతం సమస్యల్ని పరిష్కరించాం: ఓలా

స్కూటర్ల విషయంలో సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని 99 శాతం మేర పరిష్కరించామని ఓలా రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. వినియోగదారుల హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఈ నెల 7న CCPA నుంచి సంస్థకు షోకాజ్ నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఫిర్యాదుల్ని పరిష్కరించే అద్భుతమైన వ్యవస్థ మా సంస్థకు ఉంది. 10,644 ఫిర్యాదులు రాగా వాటిలో 99.1శాతాన్ని పరిష్కరించాం’ అని పేర్కొంది.
Similar News
News April 1, 2026
ఉమెన్స్ క్రికెట్లో సంచలనం.. భారత రికార్డు బ్రేక్

మహిళల క్రికెట్లో సంచలనం నమోదైంది. అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా టీమ్ఇండియా(341) పేరిట ఉన్న రికార్డును న్యూజిలాండ్ బద్దలుకొట్టింది. NZతో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 346 పరుగులు చేసింది. ఛేదనలో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేసింది. 49.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. అమెలియా కేర్ 139 బంతుల్లోనే 179* పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. ఇసబెల్లా 68 పరుగులతో రాణించారు.
News April 1, 2026
TNలో అల్లర్లకు BJP కుట్ర: స్టాలిన్

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ BJPపై CM స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు BJP కుట్ర పన్నిందని, దాన్ని అధికార DMK భగ్నం చేసిందని చెప్పారు. BJP పాలిత రాష్ట్రాలైన UP, మణిపుర్లో కొనసాగుతున్న మూక దాడులు, మత ఘర్షణలు TNలో లేవని ఎద్దేవా చేశారు. DMK ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మహిళలు తమకు నచ్చిన గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు రూ.8వేల కూపన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
News April 1, 2026
వాణిజ్య పంటలు సాగుచేస్తే రూ.10,000!

TG: వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగుచేసే రైతులకు ఎకరాకు ₹10,000 ప్రోత్సాహకం ఇవ్వాలని GOVT భావిస్తోంది. పప్పుధాన్యాలు, మార్కెట్లో డిమాండ్ ఇతర వాణిజ్య పంటల సాగుకు మారే రైతులకు దీన్ని అందించనున్నారు. దీనిపై CM రేవంత్ అధికారులతో చర్చిస్తున్నారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఎకరాకు ₹20,000 వెచ్చిస్తోంది. పైగా నిల్వ చేయడం సవాలుగా మారుతోంది. పంజాబ్లో రైతులకు ₹17,000 ప్రోత్సాహకం ఇచ్చే స్కీమ్ అమల్లో ఉంది.


