News October 23, 2024
99 శాతం సమస్యల్ని పరిష్కరించాం: ఓలా

స్కూటర్ల విషయంలో సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని 99 శాతం మేర పరిష్కరించామని ఓలా రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. వినియోగదారుల హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఈ నెల 7న CCPA నుంచి సంస్థకు షోకాజ్ నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఫిర్యాదుల్ని పరిష్కరించే అద్భుతమైన వ్యవస్థ మా సంస్థకు ఉంది. 10,644 ఫిర్యాదులు రాగా వాటిలో 99.1శాతాన్ని పరిష్కరించాం’ అని పేర్కొంది.
Similar News
News December 11, 2025
కార్యకర్తలతో పనిచేయండి: BJP ఎంపీలతో మోదీ

BJP MPలు కార్యకర్తలతో కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై దక్షిణాది BJP MPలతో ప్రత్యేక భేటీలో దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రశ్నించాలన్నారు. వచ్చే ఏడాది కేరళ, తమిళనాడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. కేంద్ర సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.
News December 11, 2025
AUS ప్రపంచ కప్ టీమ్లో భారత సంతతి ప్లేయర్లు

ICC మెన్స్ U19 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా 15 మందితో జట్టును ప్రకటించింది. ఇందులో ఇద్దరు భారత సంతతి క్రికెటర్లు చోటుదక్కించుకున్నారు. ఆర్యన్ శర్మ(ఫొటోలో), జాన్ జేమ్స్ అనే యువ ఆటగాళ్లు ఇటీవల INDతో జరిగిన యూత్ టెస్టులు, వన్డేల్లో అదరగొట్టారు. దీంతో తాజాగా ప్రపంచ కప్కు ఎంపికయ్యారు. శ్రీలంక, చైనా మూలాలున్న ప్లేయర్లు సైతం జట్టులో ఉండటం గమనార్హం. ఈ టోర్నీ జనవరి 15 నుంచి నమీబియా, జింబాబ్వేలో జరగనుంది.
News December 11, 2025
పిల్లలకు SM బ్యాన్ చేయాలి: సోనూసూద్

AUS తరహాలో INDలోనూ U16 పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నటుడు సోనూసూద్ కూడా ఇదే విషయాన్ని Xలో పోస్ట్ చేశారు. పిల్లలు స్క్రీన్ అడిక్షన్కు దూరమై నిజమైన బాల్యాన్ని గడపాలని, కుటుంబ బంధాలు బలపడాలని ఆయన పేర్కొన్నారు. దీనికి నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే పేరెంట్స్ ఫోన్లకు అతుక్కుపోతుంటే పిల్లలెలా మారుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ COMMENT.


