News April 12, 2025
991 మార్కులతో అదరగొట్టిన లాస్య

ఇంటర్ ఫలితాలలో సూళ్లూరుపేట విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. సీనియర్ ఎంపీసీలో లాస్య 991, బైపీసీలో నిత్య 985, సీఈసీలో జాహ్నవి రెడ్డి 974 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. అలాగే ప్రథమ సంవత్సరం ఎంపీసీలో భాగ్యలక్ష్మి 465, బైపీసీలో కావ్య 426, సీఈసీలో రేణుక 464 మార్కులతో పట్టణ స్థాయిలో అగ్రస్థానాలు దక్కించుకున్నారన్నారు. వారిని అధ్యాపకులు అభినందించారు.
Similar News
News April 10, 2026
KPHB: పోక్సో కేసులో వైద్యుడికి 7ఏళ్ల జైలు

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో కేపీహెచ్బీ కాలనీకి చెందిన డాక్టర్ కందుల సుబ్బారావు(76)కు కూకట్పల్లి పోక్సో కోర్టు 7ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో నమోదైన ఈ కేసులో నిందితుడికి శిక్షతో పాటు రూ.30,000 జరిమానా కూడా విధిస్తూ న్యాయమూర్తి ఎం.వెంకటేశ్వరరావు తీర్పు వెలువరించారు. కట్టుదిట్టమైన ఆధారాలతో కేసును నిరూపించిన కేపీహెచ్బీ పోలీసులను అధికారులు ప్రశంసించారు.
News April 10, 2026
రాయలసీమ అభివృద్ధికి జగన్ ఆటంకం: ఎంపీ

రాయలసీమకు అసలైన ద్రోహి జగన్ రెడ్డేనని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వంలో 102 ప్రాజెక్టులను రద్దు చేసి, నేడు రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సీమ ప్రాజెక్టుల కోసం రూ.10,014 కోట్లు కేటాయించి, చరిత్ర సృష్టించిందన్నారు. 80శాతం ప్రాజెక్టులు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే నిర్మించినవని గుర్తుచేశారు.
News April 10, 2026
IPL: టాస్ గెలిచిన రాజస్థాన్

గువాహటిలో బెంగళూరుతో మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది.
జట్లు:
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, పాటీదార్, జితేశ్, టిమ్ డేవిడ్, షెపర్డ్, కృనాల్, భువనేశ్వర్, అభినందన్, హేజల్వుడ్.
RR: జైస్వాల్, జురెల్, పరాగ్, హెట్మెయిర్, ఫెరీరా, జడేజా, బర్గర్, ఆర్చర్, సందీప్ శర్మ, బిష్ణోయ్, బ్రిజేశ్.
* వైభవ్ IMPACT


