News October 11, 2024
ఆమె ఖాతాలో రూ.999 కోట్లు జమ.. చివరికి ఏమైందంటే?

బెంగళూరులో ఓ కాఫీ షాప్ ఓనర్ ప్రభాకర్ భార్య సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి ఏకంగా రూ.999 కోట్లు జమ అయ్యాయి. దీంతో వారు ఆశ్చర్యంలో పడిపోయారు. అయితే 48 గంటల్లోనే అకౌంట్ అంతా ఖాళీ అవడమే కాకుండా ఫ్రీజ్ అయ్యింది. ఈ క్రమంలో అతను సాధారణ లావాదేవీలు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నా స్పందించడం లేదని వాపోయాడు.
Similar News
News November 21, 2025
రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్కు నోటీసులు

GHMC ఖజానాకు గండికొడుతున్న సినిమా స్టూడియోలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో విస్తీర్ణానికి ₹11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా యాజమాన్యం ₹49 వేలు చెల్లింస్తోందని గుర్తించారు. జూబ్లీహిల్స్లోని రామనాయుడు స్టూడియో విస్తీర్ణం తక్కువ చూపుతూ ₹1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా ₹1,900 చెల్లిస్తుండడంతో GHMC సర్కిల్ 18 అధికారులు నోటీసులు జారీ చేశారు.
News November 21, 2025
ఇలాంటి చెరకు తోటల్లో కోతలను ఆలస్యం చేయొద్దు

పురుగులు, తెగుళ్లు, నీటి ముంపు, నీటి ఎద్దడికి గురైన చెరకు తోటలను త్వరగా నరికి ఫ్యాక్టరీకి తరలించాలి లేదా బెల్లం తయారీకి వాడాలి. ఆలస్యం చేస్తే దిగుబడి, రస నాణ్యత తగ్గుతుంది. పూత పూసిన తోటలను ఆలస్యంగా నరికితే రస నాణ్యత తగ్గి, ఈ గడల చిగురు భాగంలో బెండు ఏర్పడి బరువు తగ్గుతుంది. కింద సగభాగం కణుపుల వరకు వేర్లు ఉండే చెరకు గడ రసంలో పంచదార శాతం గణనీయంగా తగ్గిపోతుంది. అందుకే ఈ గడలను ముందే నరికి తరలించాలి.
News November 21, 2025
ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు: TTD

AP: శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరులను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు NOV 29న ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు Global Hindu Heritage, savetemples.org సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. అవి మోసపూరితంగా విరాళాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


