News November 1, 2024

9Am UPDATE: ఉమ్మడి కర్నూలు జిల్లాలో పింఛన్ పంపిణీ ఇలా!

image

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు నంద్యాల జిల్లాలో 45.59%, కర్నూలు జిల్లాలో 39.95% పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలో 2,17,375 మందికి గానూ 99,102 మందికి, కర్నూలు జిల్లాలో 2,41,029 మందికి గానూ 96,281 మంది లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు. అయితే సర్వర్ స్లోగా ఉందని సిబ్బంది చెబుతున్నారు.

Similar News

News November 26, 2025

కలెక్టర్‌ను మైమరిపించిన ఓర్వకల్లు మహిళా రైతు

image

ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు రాజకుమారిని కలెక్టర్ డా. ఏ. సిరి ప్రశంసించారు. బుధవారం రాజకుమారి పొలంను కలెక్టర్ పరిశీలించి పంటల సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 70 సెంట్ల భూమిలో అంతర పంటల పద్ధతిలో కందులు, అలసందలు, సజ్జలు, మినుములు, గోరు చిక్కుడు, ఆకుకూరలు సాగు చేసి రూ.5 వేల పెట్టుబడితో రూ.60 వేల లాభం సాధించినట్లు రాజకుమారి వివరించారు.

News November 26, 2025

విభిన్న ప్రతిభావంతులు రాణించాలి: డీఈఓ

image

విభిన్న ప్రతిభావంతులు తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో సాధన చేసి రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. బుధవారం కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సమన్వయంతో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి, విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.

News November 26, 2025

‘ఆదోని’కి మళ్లీ నిరాశే..!

image

ఆదోని ప్రాంత ప్రజలకు మరోసారి నిరాశ ఎదురైంది. YCP ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజన సమయంలో ఆదోనిని జిల్లా చేయాలని ఆ ప్రాంతవాసులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. వారి విజ్ఞప్తిని సర్కార్ పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేర్పులు చేపట్టడంతో మళ్లీ నిరసన గళంవిప్పారు. ఈ ప్రభుత్వం కూడా మొండిచేయి చూపింది. జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను కూటమి నాయకులు CM చంద్రబాబుకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.