News December 4, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు(2020-21 విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. DEC 18-2025 JAN 3 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
Similar News
News April 19, 2026
కృష్ణా: రేపు కలెక్టరేట్లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్

జిల్లాలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గాను ఈ నెల 20వ తేదీన కలెక్టరేట్లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రారంభమయ్యే గ్రీవెన్స్లో ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News April 19, 2026
మచిలీపట్నంలో నేడు బంగారం ధర ఎంతంటే!

అక్షయ తృతీయ కావడంతో జిల్లా కేంద్రంమైన మచిలీపట్నంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మచిలీపట్నంలో ఆదివారం గ్రాము బంగారం రూ. 15,078 పలుకుతోంది. 10 గ్రాములు రూ. 1,50,780 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ.280గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.
News April 19, 2026
పెడన: పేకాడుతూ అరెస్ట్ అయిన మహిళలకు బెయిల్!

పెడనలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు జరిపిన మెరుపు దాడిలో నలుగురు మహిళలతో సహా మొత్తం ఆరుగురు పట్టుబడ్డారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిందితులను శనివారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో పట్టుబడిన మహిళల్లో ఇద్దరిపై గతంలోనే తొమ్మిది కేసులు ఉన్నట్లు తేలడం విస్మయానికి గురిచేస్తోంది.


