News December 4, 2024
ఈ నెల 7న మెగా పేరెంట్-టీచర్ మీట్

AP: ఈ నెల 7న ఉ.9 గంటల నుంచి మ.1 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో మెగా పేరెంట్-టీచర్ మీట్ను నిర్వహించనుంది. విద్యార్థులు, స్కూళ్ల అభివృద్ధిపై టీచర్లు, తల్లిదండ్రులు చర్చించనున్నారు. తల్లులకు రంగోలి పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక కార్యక్రమాలు ఉంటాయి. సీఎం CBN, మంత్రి లోకేశ్ బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Similar News
News November 3, 2025
ఎటు చూసినా మృతదేహాలే..

TG: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి <<18183773>>బస్సు<<>> ప్రమాద మృతుల బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా మృతదేహాలే కనిపిస్తుండడంతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో క్షతగ్రాతులను బెంచ్లపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని సమాచారం.
News November 3, 2025
శివారాధన సోమవారమే ఎందుకు?

సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు తన రూపాన్ని పూర్తిగా కోల్పోకుండా కాపాడి శివుడు సోమనాథుడయ్యాడు. నెలవంకను శిరస్సున ధరించి చంద్రశేఖరుడయ్యాడు. అందుకే ఈరోజున శివారాధన చేస్తే శివ సాక్షాత్కారం అందడమే కాక చంద్రుడి అనుగ్రహంతో ప్రశాంతత కలుగుతుందని శివ మహాపురాణం చెబుతోంది. సోమవారం ఈశ్వరుడిని ఏవిధంగా సేవించినా తప్పక మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
☞ మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 3, 2025
ఘోరం.. ఆనవాళ్లు లేకుండా మారిన బస్సు

రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ ఢీకొట్టి మీద పడటంతో <<18183932>>బస్సు<<>> పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా కుడివైపు ఉండే భాగం ఆనవాళ్లు లేకుండా అయింది. దీంతో ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. టన్నుల కొద్దీ బరువు ఉండే కంకర మీద పడటంతో ప్రయాణికులు దాని కింద సమాధి అయిపోయారు. జేసీబీల సాయంతో టిప్పర్ను బస్సుపై నుంచి తొలగించారు. మృతదేహాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ఉన్నట్లు సమాచారం.


