News December 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ లో రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి. @ పెద్దపల్లి ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. @ పెగడపల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ మల్లాపూర్ మండలంలో చోరీకి పాల్పడిన ముగ్గురి అరెస్ట్. @ బెజ్జంకి మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్య. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం. @ సిరిసిల్లలో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు

Similar News

News March 27, 2026

KNR: భారీ బ్యాంకు కుంభకోణం.. రూ.100 కోట్ల గోల్‌మాల్‌!

image

కరీంనగర్ నగరంలోని ఓ ప్రముఖ బ్యాంకులో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగుచూసింది. సుమారు రూ.100 కోట్లకు పైగా నిధులు నకిలీ ఖాతాలకు మళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్యాంకు సిబ్బంది సహకారంతోనే ఈ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నిధులు హవాలా మార్గంలో తరలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 27, 2026

పెట్రో, డీజిల్ ధరల తగ్గింపు చారిత్రకం: బండి సంజయ్

image

పెట్రోలు, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో కొనియాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే వ్యాట్ (VAT) తగ్గించాలని డిమాండ్ చేశారు. తద్వారా నిత్యావసరాల ధరలు తగ్గి సామాన్యులకు మేలు జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News March 27, 2026

కరీంనగర్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళల పొడిగింపు

image

కరీంనగర్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలను ప్రభుత్వం పొడిగించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 31 వరకు ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన సమయానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.