News December 5, 2024
మహిళల, బాలబాలికల భద్రత, రక్షణకు సమన్వయంతో పనిచేయాలి: ఎస్పీ

మహిళల భద్రత, రక్షణకు, బాల్యదశను ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పని చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలులోని వివిధ శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలనే కరపత్రాలను ఆవిష్కరించారు.
Similar News
News March 27, 2026
కర్నూలు: ముగ్గురిపై జిల్లా బహిష్కరణ

జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు(M) పి.రుద్రవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, పుండుకుర మధు, మధుసూదన్ తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు జిల్లా బహిష్కరణకు గురైన వారి సంఖ్య 8కి చేరింది.
News March 27, 2026
వేసవికాలం.. కర్నూలు ఎస్పీ కీలక సూచనలు!

వేసవికాలపు సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈత రాని పిల్లలు కాల్వలు, కుంటలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో నీటి వనరుల వద్ద జారిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
News March 26, 2026
జనగణన-2027ను కచ్చితంగా నిర్వహించాలి: కలెక్టర్

జనగణన-2027 ప్రక్రియను నియమ నిబంధనల ప్రకారం పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గృహ జాబితా, గృహ జనగణన కార్యక్రమాలపై నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. హౌస్ మ్యాపింగ్ను పకడ్బందీగా చేసి, నమోదు చేసే ప్రతీ వివరంలో కచ్చితత్వం పాటించాలని సూచించారు. అధికారులు పూర్తి శ్రద్ధతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.


