News December 5, 2024

BCCI కార్యదర్శి రేసులో ఉన్నది వీరేనా?

image

ICC ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు తీసుకోవడంతో BCCI కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఈ పదవి ఎవరికి దక్కుతుందనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ పోస్టు కోసం కొందరు పోటీలో ఉన్నారు. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్, BCCI సంయుక్త కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ, BCCI కోశాధికారి ఆశిష్ షెలార్ రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరిని ఆ పదవి వరిస్తుందో చూడాలి.

Similar News

News September 15, 2025

వ్యాయామం, రన్నింగ్.. మితంగా చేస్తేనే మేలు!

image

రోజూ వ్యాయామం చేయడం మంచిదే. కానీ అతిగా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వారానికి 30-50kms రన్నింగ్ చేయొచ్చు. అలాగే రోజుకు 7000-10,000 అడుగుల నడక ఉత్తమం. ఎక్కువ దూరం పరిగెత్తడం వల్ల గుండె, కీళ్ల సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంది. వారానికి రెండు నుంచి మూడు సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ సరిపోతుంది. మితమైన వ్యాయామం, సరైన విశ్రాంతి ముఖ్యం’ అని సూచిస్తున్నారు. SHARE IT

News September 15, 2025

రేపు రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!

image

TG: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. మంగళవారం రాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రికి లేఖలు ఇచ్చింది.

News September 15, 2025

సిరాజ్‌కు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ అవార్డు

image

భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ఆగస్టు) అవార్డు దక్కింది. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేశారు. 9 వికెట్లు తీసి సిరీస్ 2-2తో సమం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఆడిన సిరాజ్.. మొత్తం 23 వికెట్లు పడగొట్టారు.