News December 5, 2024
RGSA అమలులో ఏపీకి నాలుగో స్థానం: పవన్ కళ్యాణ్

AP: రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్(RGSA) పథకం అమలులో FY24లో 25వ స్థానంలో ఉన్న AP ప్రస్తుతం నాలుగో ప్లేస్కు చేరినట్లు Dy.CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రధాని మోదీ దూరదృష్టి, సీఎం చంద్రబాబు నాయకత్వానికి ఇది నిదర్శనమని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ డెవలప్మెంట్, గిరిజన సంక్షేమానికి RGSA కృషి చేస్తోందని పేర్కొన్నారు. కలిసికట్టుగా గ్రామీణ భారత రూపురేఖలను మారుస్తున్నామన్నారు.
Similar News
News February 16, 2026
పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రుళ్లే ఎందుకు?

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రి వేళ లేదా తెల్లవారుజామునే ఉంటాయి. అందుకు ప్రధాన కారణం అరుంధతీ నక్షత్ర దర్శనం. ఆకాశంలో దర్శనమిచ్చే అరుంధతి, వశిష్ఠుల జంట అన్యోన్యత, పాతివ్రత్యానికి ప్రతీక. వారిలా వధూవరులు నూరేళ్లు వర్ధిల్లాలని పురోహితులు ఈ నక్షత్రాన్ని చూపిస్తారు. ఈ నక్షత్రం అర్థరాత్రి/తెల్లవారుజామునే కనిపిస్తుంది. అందుకే ఆ నక్షత్ర దర్శనం సాధ్యమయ్యే సమయాల్లోనే ముహూర్తాలు నిర్ణయిస్తారు.
News February 16, 2026
సెంటర్ సిల్క్ బోర్డ్లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 16, 2026
‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

AP: సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ ప్రారంభించే ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ సహా ఇతర సేవలు అందనున్నాయి. హెల్త్ రికార్డులు డిజిటల్ చేయడంతో పాటు రూ.2.5 లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. ఇప్పటికే కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగిస్తుండగా రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. ఇందులో గేట్స్ ఫాండేషన్తో TCS భాగస్వాములు.


