News December 5, 2024

డిప్యూటీ సీఎంలుగా శిండే, అజిత్ ప‌వార్‌

image

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ శిండే, అజిత్ ప‌వార్‌లు ప్ర‌మాణస్వీకారం చేశారు. ముఖ్య‌మంత్రిగా ఫ‌డ‌ణ‌వీస్ ప్ర‌మాణం చేసిన అనంత‌రం వీరు ప్ర‌మాణం చేశారు. భారీ ఎత్తున జ‌రిగిన ప్ర‌మాణ‌స్వీకార‌ కార్య‌క్ర‌మానికి అన్ని రంగాల ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా, బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మాజీ క్రికెటర్ సచిన్ స‌హా ఇత‌ర ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

Similar News

News November 14, 2025

హరీశ్‌కు అసూయ, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు: రేవంత్

image

TG: అధికారం పోయినా హరీశ్ రావుకు అసూయ, KTRకు అహంకారం తగ్గలేదని CM రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘వారిద్దరు అసూయ, అహంకారం తగ్గించుకోవాలి. అసెంబ్లీలో రక్తమంతా మొహంలోకి తెచ్చుకుని హరీశ్ చూస్తుంటాడు. ఆ చూపులకు శక్తి ఉంటే మాడి మసైపోతాం’ అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, వారసత్వ సంపద కాదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు చేయాలని అన్నారు. సమస్యలపై ధర్నాలు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు.

News November 14, 2025

వ్యవసాయంలో ‘ఫర్టిగేషన్’ అంటే ఏమిటి?

image

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్‌లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

News November 14, 2025

‘ఫర్టిగేషన్’లో ఎరువులను ఎలా అందించాలి?

image

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.