News December 5, 2024
‘జైపూర్ బుకీస్’ ఆవిష్కరించనున్న రతన్ టాటా మిత్రుడు

దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆప్త మిత్రుడు శంతను నాయుడు జంతుప్రేమికుడు మాత్రమే కాదు రచయిత కూడా. పుస్తక ప్రేమికుల కోసం ఈ నెల 8న జైపూర్ ఎడిషన్ బుకీస్ను ఆవిష్కరించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ప్లేసుల్లో పుస్తక పఠనం చేయడం. ముందుగా ముంబైలో దీనిని ఆవిష్కరించిన శంతను తర్వాత పుణే, బెంగళూరుకు దీనిని విస్తరించారు.
Similar News
News March 8, 2026
రాష్ట్రపతి ఘటన: మమత సర్కార్పై కిషన్ రెడ్డి ఫైర్

బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతి <<19322594>>ద్రౌపదీ ముర్ము<<>> పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సంతాళీ తెగ సమ్మేళనాన్ని ఉద్దేశపూర్వకంగానే ఆ జనాభా తక్కువ ఉన్న చోట నిర్వహించడం, కనీస ప్రొటోకాల్ పాటించకుండా CM మమతా బెనర్జీ గైర్హాజరు కావడం గిరిజన జాతులను అవమానించడమేనని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారిని రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం సరికాదని ధ్వజమెత్తారు.
News March 8, 2026
దేశంలో మరో UT ఏర్పాటంటూ వార్తలు.. ఖండించిన కేంద్రం

WBలోని సిలిగుడి కారిడార్ సమీపంలో కొత్త కేంద్ర పాలిత ప్రాంతం(UT) ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఓ వార్త వైరలవుతోంది. ఇందులో బిహార్, బెంగాల్లోని 6 జిల్లాలు ఉంటాయంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని PIB Fact Check ఖండించింది. కాగా ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాలు సిలిగుడి నుంచే వెళ్తాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాకు ఇది సమీపంలో ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
News March 7, 2026
‘విజయ’ బ్రాండ్తో కల్తీ.. AP డెయిరీపై ఆరోపణలు

TG: AP విజయ డెయిరీ తీరుపై తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అమిత్ రెడ్డి మండిపడ్డారు. అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలు ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి వస్తున్నాయని ఆరోపించారు. మేఘనా ఫుడ్స్ తయారు చేస్తున్న నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్ ఉన్నట్లు తెలిపారు. దీనివల్ల తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. AP ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.


