News December 5, 2024

తిరుమలలో అన్యమత గుర్తుతో వస్తువు విక్రయం.. షాప్ సీజ్

image

AP: తిరుమలలో అన్యమత గుర్తు, పేరు కలిగిన వస్తువును విక్రయించిన దుకాణాన్ని TTD అధికారులు తాత్కాలికంగా సీజ్ చేశారు. ఈ విషయాన్ని TTD ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. HYDకు చెందిన భక్తుడు ఇవాళ ఉదయం CRO ఆఫీస్ ఎదురుగా ఒక షాప్‌లో స్టీల్ కడియాన్ని కొనుగోలు చేయగా, దానిపై అన్యమత పేరు, గుర్తు ఉండటంతో తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వెంటనే ఆ షాప్‌ను తాత్కాలికంగా మూసివేసి విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 7, 2025

తరచూ ఛాతి ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారా?

image

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్‌లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్‌కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

News November 7, 2025

వేమూరి వినోద్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

image

AP: కర్నూలు బస్సు <<18110276>>ప్రమాద ఘటన<<>>లో వి.కావేరి ట్రావెల్స్ యజమాని, A2 వేమూరి వినోద్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ వెల్లడించారు. కర్నూలు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. OCT 28న A1 డ్రైవర్ లక్ష్మణ్‌ను అరెస్టు చేశారు. గత నెల జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.

News November 7, 2025

భారత్ స్వర్గధామంలాంటి ఆశ్రయం ఇచ్చింది: హసీనా

image

బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వంలో తీవ్రవాదులకు మద్దతునివ్వడం వల్ల ఇండియాతో సంబంధాలు దెబ్బతింటాయని ఆదేశ ex-PM షేక్ హసీనా అన్నారు. అవామీ లీగ్‌పై నిషేధంతో తన మద్దతుదారులు రానున్న ఎలక్షన్లో పాల్గొనే అవకాశం లేదని చెప్పారు. మైనారిటీలు దాడులకు గురవుతున్నారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టుకు ఆధారాలు సమర్పిస్తానన్నారు. భారత్ తనకు స్వర్గధామంలాంటి ఆశ్రయాన్ని కల్పించిందని ప్రశంసించారు.