News December 5, 2024
అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోండి: చంద్రబాబు

AP: ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల ఆందోళనల ఘటనలపై కృష్ణా జిల్లా కలెక్టర్తో CM చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమైతే తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను పక్కాగా అమలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్ల అంశాన్ని నిత్యం సమీక్షిస్తూ సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు.
Similar News
News December 30, 2025
ఫిబ్రవరిలో మున్సిపల్.. మేలో GHMC ఎన్నికలు?

TG: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. 2026 FEBలో నిజామాబాద్, మహబూబ్నగర్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం, కరీంనగర్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసేలా ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. MAY చివరి నాటికి GHMC, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరపాలని చూస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల గెజిట్ వచ్చిన తర్వాత అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
News December 30, 2025
హరీశ్ రావు ఆరోపణలకు ఉత్తమ్ కౌంటర్

TG: బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ <<18714031>>హరీశ్ రావు<<>> చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ ఖండించారు. ‘హరీశ్ రావు అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్పై ప్రభుత్వం పోరాడుతూనే ఉంది. ఇప్పటికే దానిపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. అది జనవరి 5న విచారణకు రానుంది. కేంద్రం ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడమే కాకుండా.. DPR కూడా సిద్ధం చేయకుండా APని అడ్డుకుంది’ అని తెలిపారు.
News December 30, 2025
తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు

పలువురు IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. GHMCపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇద్దరు Addl.కలెక్టర్లను నియమించింది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లకు సృజన, మల్కాజిగిరి, LBనగర్, ఉప్పల్ జోన్లకు వినయ్ కుమార్ను కేటాయించింది. PR&RD డైరెక్టర్గా శ్రుతి ఓజా, NZB కలెక్టర్గా ఇలా త్రిపాఠి, NLG కలెక్టర్గా చంద్రశేఖర్, నారాయణపేట్ Addl.కలెక్టర్గా ఉమాశంకర్ను నియమించింది.


