News December 5, 2024
నో డేటా.. కేంద్రం తీరుపై విమర్శలు

డిజిటల్ యుగంలోనూ పలు అంశాలకు సంబంధించి తమ వద్ద డేటా లేదని కేంద్రం చెప్పడం విమర్శలకు దారితీస్తోంది. దేశంలో ప్రకృతి విపత్తుల వల్ల వాటిల్లిన నష్టం అంచనా, మెడికల్ ఇంటర్న్ల ఆత్మహత్యలు, విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు, పేపర్ లీకులపై వివరాల్లేవని పార్లమెంటుకు కేంద్రం తెలిపింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రం వైఖరి విస్మయానికి గురిచేస్తుందని విమర్శిస్తున్నాయి.
Similar News
News January 18, 2026
రేపు మౌని అమావాస్య.. ఉదయమే ఇలా చేయండి

రేపు పవిత్రమైన ‘<<18871132>>మౌని అమావాస్య<<>>’. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. ఉదయం సూర్య నమస్కారం చేయాలి. అనంతరం శ్రీహరి, మహాలక్ష్మీ, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. రేపు మౌనవ్రతం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది.
News January 17, 2026
బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి: బండి సంజయ్

TG: త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమావేశం’లో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధికి నయాపైసా రాదని, బీఆర్ఎస్కు వేస్తే వృథాయేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
News January 17, 2026
100 దేశాలకు కార్ల ఎగుమతి.. మారుతీ సుజుకీ ప్లాన్

తమ విక్టోరిస్ మోడల్ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. విక్టోరిస్ను అక్రాస్ పేరుతో గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తామని చెప్పింది. 450 కార్ల తొలి బ్యాచ్ను తరలించామని వెల్లడించింది. 2025లో 3.9 లక్షల కార్లను ఎగుమతి చేశామని సంస్థ సీఈవో హిసాషి టకేయుచి తెలిపారు. విక్టోరిస్ ధర రూ.10.50 లక్షలు-రూ.19.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.


