News December 6, 2024
కడప: ‘రెవెన్యూ సదస్సులు విజయవంతం చేయాలి’

జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ప్రజాప్రతినిధులతో గురువారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రజలు, రైతుల భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలు అన్నింటికీ పరిష్కార మార్గం చూపడానికి ఈనెల 6వ తేదీ నుంచి వచ్చేనెల జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు.
Similar News
News February 28, 2026
కడప జిల్లాలో నేటి ఇంటర్ పరీక్షలకు 4,470 మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ బాటనీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,626 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,470 మంది రాశారు. 156 మంది ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 3,473 మందికి గాను.. 3,383 మంది పరీక్షలకు హాజరయ్యారు. 93 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,153 మందికి గాను.. 1,087 మంది పరీక్షలు రాశారు. 66 మంది ఆబ్సెంట్ అయ్యారు.
News February 28, 2026
ప్రొద్దుటూరు అవినీతి అధికారుల గుండెల్లో గుబులు.!

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంకు అవినీతిపై పూర్వక మేనేజర్ ప్రవీణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇతర శాఖల్లోని ఇంటి దొంగలు ఆందోళన చెందుతున్నారు. వీరిపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మొదట పెట్రోల్ బంక్ అవినీతిపై కేసు నమోదయింది. మున్సిపల్, హౌసింగ్, హౌస్ బిల్డింగ్ సొసైటీ, శివాలయంలో అవినీతిపై కేసుల నమోదుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
News February 28, 2026
అక్రమ గల్ఫ్ ఏజెంట్లపై కడప ఎస్పీ కొరడా

మహిళలను టూరిస్ట్ వీసాలపై గల్ఫ్ పంపి మోసగిస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నచికేత్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలు కేవలం రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలి అన్నారు. గల్ఫ్లో ఇబ్బంది పడుతున్నవారు ‘Madad’ పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. దళారుల సమాచారం తెలిస్తే 9121100504, 9121100652 నంబర్లకు తెలపాలన్నారు.


