News December 6, 2024
చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్

AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్ చేశారు. చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన వెన్నుపోటుదారుల్లో చంద్రబాబు ఒకరని ఎద్దేవా చేశారు. మార్కస్ బ్రూటస్ (జాలియస్ సీజర్), మిర్ జాఫర్ (బెంగాల్), జూడాస్ (జీసస్), రాజా జయ్చంద్ (రాజా పృథ్వీరాజ్)ను వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు ఎన్టీఆర్ను పొడిచారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 13, 2026
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ Y పోస్టులు

<
News January 13, 2026
భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు?

దక్షిణాయనంలో సూర్యుడు దూరమవ్వడం వల్ల చలి విపరీతంగా పెరుగుతుంది. ఆ చలిని తట్టుకోవడానికి, ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ ఈ మంటలు వేస్తారు. ఈ మంటలు చలి నుంచి రక్షణనిస్తూ శరీరానికి వెచ్చదనం ఇస్తాయి. అలాగే గతేడాది పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేసి, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలు ప్రసాదించమని కోరుతూ ఈ మంటలు వేస్తారు. నూతన వెలుగులతో కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఈ భోగి మంటల అసలైన ఉద్దేశం.
News January 13, 2026
‘లైట్ ట్రాప్స్’తో సుడిదోమ, పచ్చదోమ కట్టడి

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతంచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్తో పాటు ఒక టబ్లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.


