News December 6, 2024
రేవంత్ ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలి: వేముల

ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించే సద్బుద్ధి ప్రసాదించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అంబెడ్కర్కు నివాళి అర్పించి వేడుకున్నారు. హైదరాబాద్లోని 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహ ప్రాంగణానికి వెళ్లి నివాళి అర్పించడానికి వీలు లేకుండా తమను హౌజ్ అరెస్ట్లు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
Similar News
News January 17, 2026
నిజామాబాద్లో సైబర్ మోసం

NZB పూసలగల్లి వాసి ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1.10 లక్షల మోసానికి గురయ్యాడు. లాభాలు గడించే సూచనలు చేసేందుకు రూ.3 వేలు చెల్లించి తమ గ్రూపులో చేరాలని మెస్సేజ్ వచ్చింది. డబ్బులు చెల్లించగా సైబర్ నేరగాళ్లు అతడి ఫోన్కు ఒక QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే మెళుకువలు తెలుస్తాయన్నారు. అది స్కాన్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News January 17, 2026
NZB: మందుగుండు పేలి ఆవు మృతి

వన్యప్రాణుల వేట కోసం దుండగులు వేసిన ఉచ్చు ఒక పాడిఆవు ప్రాణాలను బలితీసుకుంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన కారె సాయికుమార్ అనే రైతు తన ఆవును మేత కోసం జాన్కంపేట్ శివారులోకి తీసుకెళ్లారు. అడవిపందుల కోసం పేలుడు మందును పశువులకు పెట్టే తవుడులో ముద్దలుగా చేసి ఉంచారు. మేత మేస్తున్న క్రమంలో ఆవు ఆ తవుడు ముద్దను తినగానే ఒక్కసారిగా నోట్లోనే పేలుడు సంభవించి ఆవు నోటిభాగం తీవ్రంగా ఛిద్రమై మృతి చెందింది.
News January 17, 2026
NZB: ఆశవాహుల్లో ఉత్కంఠ

నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు శనివారం మహిళా రిజర్వేషన్లను ప్రకటించనున్న నేపథ్యంలో పోటీ చేసే ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. ఏ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందోనని కార్పొరేటర్, కౌన్సిలర్ ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్, BJP, BRSపార్టీల నేతలు తమ వారిని నిలబెట్టించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.


