News December 6, 2024
CTR : 10వ తేదీన జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో 10వ తేదీన చిత్తూరు పట్టణంలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధుల హాజరవుతారని తెలియజేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక, పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 3, 2026
మామిడి రైతులను ఆదుకోవాలని వినతి

గత సీజన్లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని మామిడి రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి కోరారు. మామిడి రైతులకు 50% రాయితీతో ఎరువులు, పురుగు మందులు అందేలా చూడాలని కలెక్టర్ సుమిత్ కుమార్కు సోమవారం వినతిపత్రం అందించినట్లు ఆయన చెప్పారు. మామిడి కవర్లను సబ్సిడీ ధరతో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
News February 2, 2026
చిత్తూరు జిల్లాలో విషాదం.. వేడి నీళ్లలో పడి చిన్నారి మృతి

వెదురుకుప్పం (M) పాతగుంట గ్రామానికి చెందిన జి మధు (3) సోమవారం వేడి నీటిలో పడి శరీరం పూర్తిగా కాలిపోయిన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల అత్యవసర చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందింది. దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News February 1, 2026
పుత్తూరు: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

తిరుపతి–చెన్నై జాతీయ రహదారిపై గోవిందపాళ్యం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత,మనవడు మృతి చెందారు. ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బైక్ని బొలెరో ఢీకొనడంతో కళాప్పన్ (65) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన మనవడు విజయన్ (32) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


