News December 6, 2024
కౌలాస్కోటను సందర్శించిన సబ్ కలెక్టర్

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శుక్రవారం సందర్శించారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కౌలాస్ కోటను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి రేపు (శనివారం) సందర్శించనున్న నేపథ్యంలో ఆమె కౌలాస్ కోటను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
Similar News
News March 6, 2026
NZB: నేడు BJP పార్లమెంట్ స్థాయి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం

NZB పార్లమెంట్ స్థాయి BJP విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నారు. అలాగే పార్లమెంట్ పరిధిలో నూతనంగా గెలుపొందిన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. మాధవ్ నగర్ లోని కమ్మ సంఘంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి MP ఈటల రాజేందర్, NZB MP అర్వింద్ ధర్మపురి, MLA లు హాజరవుతున్నారు.
News March 5, 2026
NZB: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు: డీఎంహెచ్వో

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తెలిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మాతా శిశు మరణాలతో పాటు నెల లోపు శిశువుల మరణాల సంఖ్యను తగ్గించడంపై చర్చించారు.
News March 5, 2026
నిజామాబాద్: ముగ్గురికి జైలు.. 26 మందికి భారీ జరిమానా!

నిజామాబాద్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 29 మందికి కోర్టు భారీ జరిమానా, జైలు శిక్ష విధించింది. తనిఖీల్లో పట్టుబడిన వారిని ఇన్స్పెక్టర్ ప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిలో 26 మందికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షల జరిమానా విధించారు. పులాంగ్కు చెందిన యాదగిరి, గూపన్పల్లికి చెందిన రాజేశ్వర్, ఒడ్డట్పల్లికి చెందిన నవీన్ కుమార్లకు వారం రోజుల జైలు శిక్ష పడింది.


